Andhra Pradesh
ఏపీలో మందుబాబులకు ఇక పండగే.. ప్రభుత్వం చాలా తక్కువకే!

ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి అమల్లోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం లైసెన్సులు దక్కించుకున్నవారు ఏపీఎస్బీసీఎల్కు ఆర్డర్లు పెట్టారు. ఇక ఈ మద్యం విలువ సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. మద్యం షాపులకు లిక్కర్ ఆర్డర్ల కోసం ఎక్సైజ్ శాఖ లైసెన్సులు దక్కినవారికి ప్రత్యేకంగా లాగిన్ ఐడీలు కేటాయించింది.
ఈరోజు నుంచి మందుబాబులు కోరుకునే అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే షాపుల లైసెన్సులు దక్కించుకున్నవారు ఆర్డర్లు పెట్టిన రకాలను ఏపీఎస్బీసీఎల్ సరఫరా చేయబోతుంది. దేశవ్యాప్తంగా లభించే అన్ని బ్రాండ్లను వారం రోజుల్లో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అయితే రూ.99కే క్వార్టర్ మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే నాలుగు నేషనల్ కంపెనీలు ఆ ధరలో అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ మద్యం కూడా రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందంటున్నారు.
మరోవైపు ప్రభుత్వం మద్యంపై కొత్తగా డ్రగ్ కంట్రోల్ సెస్ విధించింది. ల్యాండెడ్ కాస్ట్పై సెస్ 2 శాతం మేర వేయనుంది. దీనిద్వారా ఏడాదికి రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సెస్ ద్వారా వచ్చే డబ్బుల్ని డ్రగ్స్, గంజాయి, ఇతర వ్యసనాల నుంచి విముక్తి.. కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం వెచ్చిస్తారు. అలానే కొంత డబ్బులు యాంటీ నార్కొటిక్స్ టాస్క్ఫోర్స్కు కూడా కేటాయించబోతున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
నూతన మద్యం పాలసీలో ప్రభుత్వం రూ. 99కే క్వార్టర్ బాటిల్ మద్యం అందజేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ అమలులో ధరల సవరణకు కేబినెట్ ఆమోదం కావాలి.. అలాగే కొన్ని మద్యం కంపెనీలు రూ.99కే క్వార్టర్ మద్యం అందించేందుకు ఒప్పుకోగా.. మరికొన్ని కంపెనీలు ఆమోదం తెలపాల్సి ఉంది. అందుకే రెండు, మూడు రోజుల్లో రూ.99కే మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఆయా కంపెనీలకు సంబంధించిన సరుకు ఇప్పటికే లిక్కరు డిపోలకు చేరుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ఎంసీ విస్కీ, రాయల్స్టాగ్, ఐవీ, రాయల్గ్రీన్లతో పాటు కింగ్ఫిషర్, 100 పైపర్స్ వంటి బీర్లతో పాటూ మరికొన్ని కూడా ఉన్నాయి. ఈ బ్రాండ్లన్నీ మద్యం షాపుల్లో అందుబాటులోకి వస్తాయి.
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మద్యం షాపులో డిజిటల్ పేమెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. గత ఐదేళ్లు మద్యం షాపుల్ని ప్రభుత్వమే నిర్వహించగా.. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో లేవు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా.. డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డిజిటర్ పేమెంట్లు పెరిగాయి.. జూన్ నుంచి ప్రతినెలా 9 శాతం పెరిగాయని చెబుతున్నారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు