Connect with us

Andhra Pradesh

ఏపీలో మందుబాబులకు మంచి వార్త.. రూ.99కే మద్యం, మంత్రి కీలక ప్రకటన

ఏపీలో మద్యంపై మంత్రి కీలక ప్రకటనలు చేశారు. జాతీయ స్థాయిలో ప్రఖ్యాత కంపెనీలతో కలసి రూ.99 ధరకు మద్యం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ మద్యం రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిందని, ఇప్పటివరకు 5 లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయని వెల్లడించారు. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు కూడా ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్నాయని, అవి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని చెప్పారు. ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వం మద్యం షాపులను పెంచకపోయినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ఐదేళ్లలో కల్తీ మద్యం తాగి ప్రజలు మరణించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా మద్యం షాపులను కేటాయించామని, నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. తమ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొనగా, గత ప్రభుత్వంలో అవినీతి కారణంగా అంతే మొత్తం కోల్పోయామని తెలిపారు. పాత ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు కూడా అమ్మకాలు నిలిచిపోయాయని చెప్పారు.

రూ.99 ధరకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకురావాలని, పొరుగు రాష్ట్రాలకంటే ఏపీలో ధరలు తక్కువగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. టెండర్ కమిటీ ద్వారా మద్యం ధరలను నిర్ణయించనున్నట్లు చెప్పారు. గతంలో ఉన్న 3,396 షాపులకే టెండర్లు పిలిచి, వాటిలో 10% వాటా కల్లుగీత కార్మికులకు కేటాయించామన్నారు. ఈ విధానం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా షాపులు కేటాయించబడ్డాయి. అలాగే, బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Loading

Trending