Connect with us

Andhra Pradesh

Andhra Pradesh: టీచర్‌ పిలిస్తే వెళ్లిన 4వ తరగతి విద్యార్థిని.. తాకరాని చోట తాకుతూ.. !

Andhra Pradesh: టీచర్‌ పిలిస్తే వెళ్లిన 4వ తరగతి విద్యార్థిని.. తాకరాని చోట తాకుతూ.. !

స్కూలు నుంచి ఇంటికి వచ్చిన బాలిక దుస్తులపై రక్తం మరకలు ఉండటంతో తల్లి ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.

ప్రకాశంజిల్లాలో ఓ ప్రభుత్వం ఉపాధ్యాయుడు బరితెగించాడు. అభం శుభం తెలియని బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఒక ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడు వీరపనేని చెన్నకేశవులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధిత బాలిక స్పష్టంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వని కారణంగా కేసు నమోదులో జాప్యం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఎట్టకేలకు బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్‌ మేరకు నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరపనేని చెన్నకేశవులు అనే నిందిత ఉపాధ్యాయుడిని కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు దళిత మహిళ కావడంతో ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశంజిల్లాలో సంచలనం సృష్టించిన నాలుగో తరగతి విద్యార్ధినిపై లైంగిక దాడి విషయంలో ఘటన జరిగిన తరువాత నాటకీయ పరిణామాల మధ్య మూడురోజుల తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల అనంతరం నిందిత ఉపాధ్యాయుడు వీరపనేని చెన్నకేశవును పోలీసులు అరెస్టు చేశారు.

స్కూలు నుంచి ఇంటికి వచ్చిన బాలిక దుస్తులపై రక్తం మరకలు ఉండటంతో తల్లి ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. స్కూల్లో తన స్నేహితురాలు టీచర్ పిలుస్తున్నాడని తీసుకెళ్లింది, అక్కడ టీచర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని విద్యార్థిని తన తల్లికి చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

అనంతరం బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అయితే డాక్టర్లు బాలికను పరీక్షించిన తరువాత తనపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందన్నది పోలీసులు విచారిస్తుండగా స్పష్టంగా చెప్పలేకపోయింది. ఈ కారణంగా అదేరోజు పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాలిక భయపడుతుందన్న కారణంగా రెండో రోజు కూడా ఆమె స్టేట్‌మెంట్‌ తీసుకున్నా, క్లారిటీ లేదన్న కారణంగా మూడు రోజుల వరకు విచారణ ముందుకు సాగలేదు…

Advertisement

మరోవైపు విద్యార్ధినికి బ్లీడింగ్‌ కావడంతో వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్సకోసం చేరిన విద్యార్ధిని వ్యవహారంలో పోలీసులు ఇంకా క్లారిటీ రాలేదన్న కారణంగా తాత్సారం చేయగా విద్యాశాఖ అధికారులు డిప్యూటీ డిఇఓ చంద్రమౌళి, సర్వశిక్షా అభియాన్‌ అదికారి మాధవి లత విచారణ చేపట్టారు. విద్యాశాఖ అధికారులు హైస్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారించడమే కాకుండా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను కూడా పరామర్శించారు.

బాలిక చెప్పిన వివరాల ప్రకారం, తన స్నేహితురాలు టీచర్ పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లగా, అక్కడ టీచర్ తన శరీరానికి అనుచితంగా తాకాడని, రహస్య భాగాలకు వేళ్లతో తాకుతూ దుర్వ్యవహారానికి పాల్పడ్డాడని విద్యాశాఖ అధికారులకు వెల్లడించింది.

బాలిక ఈ సంఘటనలో లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిని స్పష్టంగా గుర్తించడంతో, నిందితుడు వీరపనేని చెన్నకేశవును పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇప్పటికే నిందితుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే బాలిక దళితురాలు కావడంతో అట్రాసిటీతోపాటు అత్యాచార నిరోధక చట్టం ప్రకారం మరో కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Loading

Trending