Andhra Pradesh
నన్ను కావాలనే ఇరికించారు.. జానీ మాస్టర్ కి 14 రోజుల రిమాండ్

జానీ మాస్టర్ కి ప్రస్తుతం గోల్కొండలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అటు తరువాత పోలీసులు అతడ్ని ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్కు రిమాండ్ మాత్రం విధించేసింది. అయితే ఈ క్రమంలో జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ అక్కడకు వచ్చిన మీడియాతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
తాను ఎవ్వరినీ వేధించలేదని, తాను ఏ తప్పు చేయలేదని, తనను కావాలనే ఇందులో ఇరికించారని, వారిని వదిలి పెట్టనని అన్నాడు. కోర్టులో న్యాయపరంగా పోరాడి.. నిజాయితీగా తిరిగి వస్తానని అన్నాడు. ప్రస్తుతం జానీ మాస్టర్కు కోర్టు అక్టోబర్ 3 వరకు రిమాండ్ను విధించిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ను చంచల్ గూడ జైలుకి తరలించనున్నట్టుగా తెలుస్తోంది.
జానీ మాస్టర్ వద్ద పని చేసిన అసిస్టెంట్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మైనర్గా ఉన్న టైంలో ఆ అమ్మాయి మీద అత్యాచారం, వేధింపులకు పాల్పడటంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ను గోవాలో స్పెషల్ టీంకు చెందిన పోలీసులు పట్టుకున్నారు. గురువారం నాడు పోలీసులు జానీని హైద్రాబాద్కు తరలించారు. నేడు ఇలా వైద్య పరీక్షలు చేయించి.. ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు