News
సీఎంను కలిసిన మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, వేముల వీరేశం, కాలే యాదయ్య ఉన్నారు. మాదిగ సామాజికవర్గం నుంచి తమకు క్యాబినెట్లో చోటు కల్పించాలని వారు సీఎంను కోరినట్లు సమాచారం.
ఈ సందర్భంగా, సీఎం రేవంత్ రెడ్డి వారిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం, కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి దాదాపు ఖరారైనట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణపై రాష్ట్రంలో రాజకీయ చర్చలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ సమావేశం ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు