Latest Updates
సిరిసిల్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్తో గాయాలు
సిరిసిల్లలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో ఉంచాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సీఎం ఫొటోతో కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.
ఈ పరిణామం ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు పక్షాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్కు దిగారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ, సిరిసిల్లలో రాజకీయ వాతావరణం ఉద్విగ్నంగా కొనసాగుతోంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు