Connect with us

National

శ్రేయస్ అయ్యర్ ఎందుకు బెస్ట్ కెప్టెన్: నవజోత్ సింగ్ సిద్ధూ ప్రశంసలు

Shreyas Iyer : వీడు మగాడ్రా బుజ్జి.. చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్

ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ నైపుణ్యంపై కామెంటేటర్ నవజోత్ సింగ్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. అయ్యర్ నాయకత్వ ప్రతిభ గురించి మాట్లాడుతూ, సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “శ్రేయస్ అయ్యర్ ఎందుకు బెస్ట్ అంటే.. అతడు ఢిల్లీ జట్టును ఏడేళ్ల తర్వాత ప్లేఆఫ్స్కు, 13 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేర్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. అలాగే, పంజాబ్ జట్టును 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్ మరియు ఫైనల్కు చేర్చాడు,” అని సిద్ధూ వివరించారు.

అయ్యర్ విజయాలను రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలతో పోలుస్తూ సిద్ధూ మరో కీలక అంశాన్ని హైలైట్ చేశారు. “రోహిత్ శర్మ, ధోనీ గొప్ప కెప్టెన్లు అవును, కానీ వారు ఒకే జట్టుతో ఎక్కువ కాలం ఆడారు. కానీ అయ్యర్ వేర్వేరు జట్లకు నాయకత్వం వహించి, ప్రతి జట్టునూ విజయపథంలో నడిపించాడు,” అని ఆయన పేర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్ బహుముఖ నాయకత్వ శైలి, విభిన్న జట్లతో సాధించిన విజయాలు ఆయన్ను ప్రత్యేకంగా నిలిపాయని సిద్ధూ అభినందించారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending