Latest Updates
శర్మిష్ఠ కేసులో కీలక మలుపు: ఫిర్యాదిదారు వజాహత్ ఖాన్ మిస్సింగ్
ఆపరేషన్ సిందూర్ విషయంలో బాలీవుడ్ ముస్లిం నటులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఇన్ఫ్లుయెన్సర్, లా స్టూడెంట్ శర్మిష్ఠ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ కనిపించకుండా పోయాడు. ఈ విషయంపై వజాహత్ తండ్రి ఫిర్యాదు మేరకు కోల్కతా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వజాహత్ తండ్రి మాట్లాడుతూ, “నా కొడుకు అమాయకుడు. అతడు హిందుత్వాన్ని ఎప్పుడూ అవమానించలేదు. శర్మిష్ఠ అరెస్టు తర్వాత మా కుటుంబానికి నిరంతర బెదిరింపులు వస్తున్నాయి,” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కేసులో కొత్త మలుపు తీసుకొచ్చింది. పోలీసులు వజాహత్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ కేసు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శర్మిష్ఠ అరెస్టుతో ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం, వజాహత్ మిస్సింగ్తో మరింత ఉద్విగ్నతను రేకెత్తిస్తోంది. పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు