Andhra Pradesh
వైసీపీ నేతల అరెస్టులపై ప్రజలు లక్ష్యపెట్టడం లేదు: ప్రొ. నాగేశ్వర్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలైన వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, పోసాని కృష్ణమురళీ తదితరులు అరెస్టయ్యారు. సాధారణంగా రాజకీయ నాయకుల అరెస్టులు జరిగితే ప్రజలు సానుభూతితో “అయ్యో” అని బాధపడతారని, కానీ ఈ వైసీపీ నేతల గత చేష్టలను చూసిన సామాన్య జనం వారిపై జాలి చూపడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.
వైసీపీలో ఇంకా అరెస్ట్ చేయాల్సిన నాయకులు ఉన్నారని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అరెస్టులు ప్రజల్లో పెద్దగా సానుభూతిని రేకెత్తించలేదని, దీనికి కారణం గతంలో వైసీపీ నేతల పాలనా విధానాలేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. వైసీపీ నేతల అరెస్టులు కేవలం రాజకీయ కక్షసాధింపులా లేక చట్టపరమైన చర్యలా అనే అంశంపై జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు