Latest Updates
లగ్జరీకి బానిసలవుతున్న మిడిల్ క్లాస్: యువతలో పెరుగుతున్న అప్పుల భారం
ఆధునిక జీవనశైలిలో లగ్జరీ వస్తువులపై మోజు మిడిల్ క్లాస్ యువతలో విపరీతంగా పెరిగిపోతోంది. అప్పు చేసైనా ఖరీదైన బ్రాండెడ్ ఉత్పత్తులు, గాడ్జెట్లు, వాహనాలు కొనుగోలు చేయాలనే ధోరణి బలంగా నెలకొంది. ఉద్యోగులు, మధ్యతరగతి నేపథ్యం ఉన్నవారు కూడా EMIల ద్వారా అధిక ధరల వస్తువులను కొంటున్నారు. మార్కెట్ నిపుణుడు అభిజిత్ చోక్సీ ప్రకారం, లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసేవారిలో 75% మంది మిడిల్ క్లాస్ వర్గానికి చెందినవారే. ఈ ధోరణి సామాజిక హోదాను పెంచుకోవాలనే తపన నుంచి పుట్టిందని, అయితే ఇది ఆర్థిక ఒత్తిడికి దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
లగ్జరీ వస్తువుల ధరలు తగ్గకపోయినా, మిడిల్ క్లాస్ వారు ధనిక వర్గంలా కనిపించాలనే ఆరాటంతో ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారని చోక్సీ వ్యాఖ్యానించారు. ‘ఇది ఒక ట్రాప్గా మారింది. యువత సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఖర్చు సంస్కృతికి బానిసలవుతోంది’ అని ఆయన హెచ్చరించారు. ఈ పోకడ వల్ల అప్పుల భారం పెరిగి, ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంలో ఈ ధోరణి మిడిల్ క్లాస్ కుటుంబాల ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు