Business
యుద్ధ సెగ: సామాన్యుడి జేబుకు చిల్లు.. నిత్యావసరాల నుంచి పెట్రోల్ వరకు అన్నీ భారం!
ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య మొదలైన పోరు భారత మధ్యతరగతి ప్రజల జీవనశైలిపై భారంగా మారనుంది. రవాణా మార్గాల్లో ఆటంకాలు, ముడి చమురు ధరల పెరుగుదల వెరసి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వంటగదిపై భారం,భారత్ ఏటా సుమారు 6 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలను (కంది, మినుము వంటివి) దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా ఖర్చులు పెరగడంతో, పప్పుల ధరలకు రెక్కలు రానున్నాయి, భారత్ తన అవసరాల కోసం 80% పైగా ముడి చమురును దిగుమతులపైనే ఆధారపడుతుంది. హార్ముజ్ జలసంధి మూతపడితే చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటే అవకాశం ఉంది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, అన్ని రకాల వస్తువుల రవాణా ఖర్చులు భారమవుతాయి, మన బాస్మతి బియ్యానికి ఇరాన్ అతిపెద్ద కొనుగోలుదారు. యుద్ధం వల్ల షిప్పింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగడంతో బియ్యం ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
టెక్స్టైల్ ఐరోపాకు వెళ్లే వస్త్ర ఎగుమతులు ఇప్పుడు సుదీర్ఘమైన ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం 20 రోజులు పెరిగి, అదనపు ఖర్చులు తోడవుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని ఐటీ ప్రాజెక్టులు కూడా స్తంభించిపోయే అవకాశం ఉంది.యుద్ధం మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే, షిప్పింగ్ ఛార్జీలు పెరిగి భారతీయ కంపెనీల లాభాలు పడిపోవడమే కాకుండా, నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటాయి. ఈ సంక్షోభం ఎంత త్వరగా ముగిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు అంత మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
![]()
