News
ముగ్గురు కొత్త మంత్రులు వీరేనా?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ముగ్గురు కొత్త మంత్రుల పేర్లు బయటికి వచ్చాయని సమాచారం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం నుంచి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాదిగ సామాజిక వర్గం నుంచి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు దక్కించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురు నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఈ విస్తరణలో సామాజిక సమతుల్యతను పాటిస్తూ, వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, వివేక్ వెంకటస్వామి, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరి లాంటి నేతలను ఎంపిక చేయడం ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణను బలోపేతం చేసే ప్రయత్నం జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేపు ఈ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం, అయితే అధికారిక ధ్రువీకరణ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు