News
మీడియా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు: BRS కార్పొరేటర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ సమావేశంలో సీతాఫల్మండి బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ మీడియా పేరుతో జరుగుతున్న వసూళ్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలు సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంటిని నిర్మించుకుంటుంటే, కొందరు మీడియా పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై GHMC అధికారులు తక్షణమే దృష్టి సారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
సామల హేమ మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు తాము రిపోర్టర్లమని చెప్పుకుంటూ, అధికారులతో కుమ్మక్కై ప్రజలను బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ విధమైన వసూళ్లు హైదరాబాద్లో పెరిగిపోతున్నాయని, ఇది పేదలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను నియంత్రించడానికి GHMC తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు