Connect with us

News

మిస్ ఇంగ్లండ్ వ్యవహారం.. హరీశ్ రావు సంచలన కామెంట్స్

సర్కార్ డాక్టర్లకు మంత్రి హరీశ్ రావు ఝలక్.. చర్యలకు రంగం సిద్ధం

హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోటీ నిర్వాహకులు తనను వేశ్యలా చూశారని, అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ, ఒక కార్పొరేషన్ ఛైర్మన్, ఒక ఐఏఎస్ అధికారి మిల్లా మాగీతో అసభ్యంగా ప్రవర్తించారని వార్తలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర గౌరవానికి మచ్చ తెచ్చిందని, సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈ ఆరోపణలను రాజకీయంగా వాడుకుంటున్నారని, మిల్లా మాగీని బీఆర్ఎస్ నేతలే ఈ విధంగా మాట్లాడించి ఉండవచ్చని ఆయన ఆరోపించారు. ఈ వివాదం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హరీశ్ రావు వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచగా, కాంగ్రెస్ నేతలు దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనపై స్పష్టమైన విచారణ జరిగితేనే నిజాలు బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending