International
మాల్దీవ్స్ కు భారత్ $50 మిలియన్ల సాయం
భారతదేశంమాల్దీవ్స్ కు ఆర్థిక సహాయం అందిస్తూ మరోసారి తన స్నేహపూర్వక వైఖరిని చాటుకుంది. తాజాగా, మాల్దీవ్స్కు 50 మిలియన్ డాలర్ల (సుమారు 420 కోట్ల రూపాయలు) ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ట్రెజరీ బిల్స్ రూపంలో అందించనున్నారు. ఈ విషయాన్ని మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ, భారత ప్రభుత్వానికి మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక సహాయం భారత్-మాల్దీవ్స్ మధ్య ఉన్న గాఢమైన స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ఇరు దేశాల మధ్య సహకారానికి ఒక నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సాయం మాల్దీవ్స్ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, దీని ద్వారా రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు