Latest Updates
మల్కాజిగిరిలో రాజకీయ వివాదం: బీజేపీ కార్పొరేటర్ సవాల్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్!
మల్కాజిగిరి రాజకీయ వేదికపై మరోసారి వివాదం రగిలింది. సఫీల్గూడ కట్టపై బీసీ మహనీయుల విగ్రహాల ఏర్పాటు విషయంలో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను విగ్రహాలు పెట్టొద్దని ఎప్పుడూ అనలేదని, ఈ విషయంలో ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా అబద్ధపు ప్రచారం చేయిస్తున్నారని శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదం మరింత ముదిరి, శ్రవణ్ కుమార్ ఎమ్మెల్యేకు బహిరంగ సవాల్ విసిరారు. “నేను విగ్రహాలు పెట్టొద్దని అన్నట్లు మీరు రుజువు చేయగలిగితే, మహంకాలమ్మ గుడి ఎదుట తడి బట్టలతో ముక్కునేలకు రాస్తాను. ఒకవేళ రుజువు చేయలేకపోతే, ఎమ్మెల్యే గారు ముక్కునేలకు రాస్తారా?” అంటూ ఆయన సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఘటనతో మల్కాజిగిరి రాజకీయాల్లో ఉద్రిక్తత పెరిగింది. బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
-
Devotional11 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు