Andhra Pradesh
భీమవరంలో మద్యం మత్తులో యువతి హల్చల్: రోడ్డుపై పడుకుని ట్రాఫిక్కు అడ్డంకి
ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ఓ యువతి మద్యం మత్తులో హైవేపై హల్చల్ సృష్టించింది. భీమవరం-పాలకొల్లు హైవేపై ఫుల్గా మద్యం సేవించి, ఆమె రోడ్డుపై అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
స్థానికులు, వాహనదారులు ఎంత చెప్పినా ఆమె అక్కడి నుంచి కదలకుండా ససేమిరా పడుకుంది. సుమారు 20 నిమిషాలపాటు రోడ్డుపైనే ఉండి, ట్రాఫిక్ను అడ్డుకుంది. ఈ ఘటనతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను రోడ్డు నుంచి పక్కకు తీసుకెళ్లి పరిస్థితిని సమసిప్తం చేశారు.
ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక ప్రవర్తన ట్రాఫిక్కు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు