Connect with us

International

భారత్-చైనా మధ్య మరోసారి ఉద్రిక్తత: అరుణాచల్‌పై చైనా కొత్త వివాదం

భారత్ - చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.... సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు  చర్యలు - BBC News తెలుగు

భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అరుణాచలప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టడం ద్వారా చైనా కొత్త వివాదానికి తెరలేపింది. ఈ చర్యను చైనా సమర్థిస్తూ, ఆ ప్రాంతాలు తమ సార్వభౌమాధికార పరిధిలో ఉన్నాయని పేర్కొంది.

చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ, “అరుణాచలప్రదేశ్, మా దేశంలో జాంగ్‌నాన్ (Zangnan)గా పిలువబడే ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు మేము పేర్లు పెట్టాము. ఈ ప్రాంతాలు పూర్తిగా చైనా సార్వభౌమాధికారం కింద ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు. అరుణాచలప్రదేశ్‌లో చైనా చేపట్టిన ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించిన అనంతరం లిన్ ఈ విధంగా స్పందించారు.

అరుణాచలప్రదేశ్‌ను భారత్ తన అవిభాజ్య భాగంగా భావిస్తుండగా, చైనా దాన్ని తమ భూభాగంలో భాగంగా చెప్పుకోవడం ద్వైపాక్షిక సంబంధాలలో ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఈ తాజా వివాదం ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యలను మరింత జటిలం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

గతంలోనూ లడఖ్‌లోని గల్వాన్ లోయ వంటి ప్రాంతాల్లో ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో, అరుణాచల్‌పై చైనా తాజా చర్యలు దౌత్యపరమైన చర్చలకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టవచ్చని అంతర్జాతీయ వేదికలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending