Latest Updates
బీజేపీకి కనీస సంస్కారం లేదు: ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
ఆపరేషన్ కగార్ను ఆపాలని కోరినప్పటికీ బీజేపీ ప్రభుత్వం మారణకాండను కొనసాగించిందని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు నంబాల మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించాలన్న కనీస సంస్కారం కూడా బీజేపీ పార్టీకి లేదని ఆమె ధ్వజమెత్తారు.
మంచిర్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, కవిత బీజేపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దళిత ఎంపీ వంశీని సరస్వతి పుష్కరాలకు ఆహ్వానించకుండా అవమానించిందని ఆమె ఆరోపించారు. గతంలో యాదాద్రిలో కూడా బీజేపీ నేత భట్టిని కింద కూర్చోబెట్టి కించపరిచారని ఆమె గుర్తుచేశారు.
ఈ రెండు పార్టీల వైఖరి సమాజంలోని బలహీన వర్గాల పట్ల గౌరవం లేని తత్వాన్ని ప్రతిబింబిస్తోందని కవిత విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కనీస మానవత్వం, గౌరవం పాటించాలని డిమాండ్ చేశారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు