Latest Updates
బంగారం ధరలు మళ్లీ జోరందుకున్నాయి
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.430 పెరిగి రూ.99,600కు చేరుకుంది. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.91,300 వద్ద నిలిచింది. ఇక వెండి ధరల విషయానికొస్తే, కేజీ వెండి ధర రూ.5,100 పెరిగి రూ.1,14,000కు చేరింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. నేడో రేపో 24 క్యారెట్ల బంగారం ధర రూ.లక్ష మార్కును తాకే సూచనలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఈ ధరల నేపథ్యంలో, పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు నిపుణులు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు