Connect with us

Telangana

పేదలకే ఇందిరమ్మ ఇళ్లు.. తప్పిదం జరిగితే చర్యలు తప్పవు: మంత్రి పొంగులేటి

y cube news

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిజమైన పేదలకు మాత్రమే గృహాలు అందేలా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకంలో ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా సరే, బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులకు ఆయన సూచించారు.

రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రమోషన్లు పొందిన అధికారులకు ఆర్డర్ కాపీలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పథకం అమలులో ఎక్కడైనా తప్పిదం జరిగితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ప్రజల నుంచి ఫిర్యాదులను సులభంగా స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు అధికారుల సహకారం కీలకమని ఆయన పేర్కొన్నారు.

 

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending