Andhra Pradesh
పదవి వచ్చాక నీవే మారిపోయావు’ – జగన్కు విజయసాయి రెడ్డి కౌంటర్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాగ్వాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత విజయసాయి రెడ్డి (వీఎస్ఆర్) తీవ్రంగా స్పందించారు. జగన్, విజయసాయి రెడ్డి చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించడంపై వీఎస్ఆర్ కౌంటర్ ఇచ్చారు.
‘నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు లొంగను, ఎవరికీ భయపడను. నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మూడు దశాబ్దాలుగా నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో గాఢమైన అనుబంధం ఉంది. పదవి వచ్చాక నీవే మారిపోయావు, జగన్. మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే. భవిష్యత్తులో అవసరమైతే ఇంకా వివరాలు వెల్లడిస్తాను’ అని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వాగ్వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. జగన్, వీఎస్ఆర్ మధ్య విభేదాలు బహిర్గతమవడంతో వైసీపీలో అంతర్గత రాజకీయ డైనమిక్స్పై ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు