Connect with us

International

నైజీరియాలో వరదల బీభత్సం: 700 మంది మృతి, వేలాది మంది నిరాశ్రయులు

నైజీరియాలో వరద భీభత్సం – 117 మంది మృతి - Prajasaktiనైజీరియాలో వరదల బీభత్సం – 150 మంది మృతి - Prajasakti

నైజీరియాలోని మోక్వా సిటీని భారీ వరదలు ముంచెత్తడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రాకృతిక విపత్తులో సుమారు 700 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 200కు పైగా మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం, అయితే మరో 500 మంది ఆచూకీ లభ్యం కాక గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరంతా వరదల సెగలో కొట్టుకుపోయి చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ విపత్తు కారణంగా వేలాది మంది సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులై, బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను చురుకుగా కొనసాగిస్తున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన నైజీరియా ప్రజలను తీవ్ర ఆందోళనలో ముంచెత్తింది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending