Connect with us

Health

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుదల: యాక్టివ్ కేసుల సంఖ్య 5,755కు చేరింది

Covid-19 Cases Rising Again: All About JN.1 Strain And Its Symptoms

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి, ఆందోళనకర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 391 కరోనా కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,755కు చేరుకుంది.

ఈ క్రమంలో, గత ఒక్క రోజులోనే కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు కరోనాతో మృతిచెందారు. దీంతో 2025 జనవరి నుంచి ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 59కి పెరిగింది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో గత ఒక్క రోజులో 10 కొత్త కేసులు, తెలంగాణలో 4 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 72, తెలంగాణలో 9 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం.

ఈ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపడుతున్నాయి.

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending