Andhra Pradesh
తమిళనాడు ఎన్నికల్లో పవన్ చరిష్మా: బీజేపీ ప్లాన్తో ఫ్యాన్స్, తెలుగు కమ్యూనిటీ టార్గెట్
వచ్చే వేసవిలో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు ఇప్పటి నుంచే వేడెక్కాయి. పొత్తులు, ఎత్తుగడలతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దక్షిణ భారతదేశంలో కీలకమైన తమిళనాడులో ఈసారి తన సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పటిష్ట వ్యూహాలు రచిస్తోంది.
ఈ క్రమంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చరిష్మాను వినియోగించుకునేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తమిళనాడులోని ఫ్యాన్స్ మరియు తెలుగు సెటిలర్ల ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని, కొన్ని కీలక సెగ్మెంట్లలో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చెన్నైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు