Latest Updates
గోరక్షణలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి: తెలంగాణ గోశాల ఫెడరేషన్ అధ్యక్షుడు
గోవుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ డిమాండ్ చేశారు. సోమవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ, గోరక్షణ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని తీవ్రంగా విమర్శించారు.
బక్రీద్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి ఓల్డ్ సిటీకి గోవులను అక్రమంగా తరలిస్తున్నారని మహేశ్ అగర్వాల్ ఆరోపించారు. ప్రభుత్వం చెక్పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ, ఈ అక్రమ రవాణాను అరికట్టడంలో ఫలితాలు సాధించలేకపోయిందని ఆయన వాపోయారు. “గోరక్షణ కోసం చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో తీవ్ర లోపాలున్నాయి. రెండు ప్రధాన పార్టీలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి,” అని ఆయన అన్నారు.
గోవుల సంరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ రవాణాను నిరోధించేందుకు మరింత కట్టుదిట్టమైన విధానాలు అవలంబించాలని మహేశ్ అగర్వాల్ ప్రభుత్వాలను కోరారు. ఈ విషయంపై గోశాల ఫెడరేషన్ తదుపరి చర్యలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు