Devotional
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు

గతేడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈసారి కొలువుదీరబోతున్నాడు.
ఖైరతాబాద్లో 1954లో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి.. ఈ ఏడాదితో 70 ఏళ్లయిన సందర్భంగా.. 70 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మహాగణపతి నమూనాను శుక్రవారం ఆవిష్క రించారు. ‘శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి’గా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్నారు.
నిల్చున్న ఆకృతిలో ఉండే గణపతి తలకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు, రెండు వైపులా 14 చేతులు, కుడివైపు చేతుల్లో చక్రం, అంకుశం, పుస్తకం, త్రిశూలం, కమలం, శంఖం, ఎడమ వైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉన్నాయి.
ఖైరతాబాద్ గణేషుడికి సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు స్థానిక ఆలయంలో ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి సామూహిక పూజలు చేశారు. అలా.. 2014 వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న గణపతిని తయారు చేయగా.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. అప్పటినుంచి విగ్రహం ఎత్తు మళ్లీ క్రమంగా తగ్గించడం మొదలు పెట్టారు. దాంతోపాటు.. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహానికి గుడ్ బై చెప్పి.. మట్టి గణపయ్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే.. గతేడాది (2023) పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. గత సంవత్సరం కంటే 7 అడుగులు ఎక్కువ ఎత్తుతో కమిటీ నిర్వహకులు మొత్తం 70 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు.
నేడు మహాగణపతికి నేత్రాలంకరణ
70 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహానికి గురువారం నేత్రాలంకరణ చేయనున్నారు. శిల్పి చిన్న స్వామి రాజేంద్రన్ నేతృత్వంలో సుమారు 200 మంది కార్మికులు నెలన్నర రోజుల్లో 70 అడుగుల విగ్రహాన్ని అన్ని హంగులతో పూర్తి చేశారు.
గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్వామి వారికి శిల్పి రాజేంద్రన్ నేత్రాలంకరణ చేస్తారు. విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలను పూర్తిగా తొలగించి.. సాయంత్రం 4గంటల నుంచే స్వామి వారి దర్శనం కల్పిస్తామని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ తెలిపారు.
మట్టి గణపతుల పంపిణీ షురూ
హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో బుధవారం కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మట్టి గణపతుల ప్రతిమలను పంపిణీ చేశారు. గ్రేటర్లో 36 ప్రాంతాల్లో 1లక్ష విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
కేబీఆర్ ప్రాంగణంలో మల్టీ పార్కింగ్
కేబీఆర్ పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాన్ని బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. కేబీఆర్ పార్కు వద్ద పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పీపీపీ విధానంలో ఈ పార్కింగ్ జోన్ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 2 న చేసిన తీర్మానం మేరకు స్టాండింగ్ కమిటీ సభ్యులు అధికారులతో కలిసి సంబంధిత పార్కింగ్ స్థలాన్ని సందర్శించారు.
ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలకు సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించారు
సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే 11 రోజుల రంగుల వినాయక చతుర్థి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని శ్రీ గణేష్ ఉత్సవ సమితి (SGUC) ఆహ్వానించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే డి. నాగేందర్ గురువారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆయనకు ఆహ్వానం పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు 70 అడుగుల ఎత్తున్న విగ్రహానికి పూజలు చేశారు. ఈసారి తన 70వ ఏట 70 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని పూజించాలని సమితి నిర్ణయించింది. 1954లో ఖైరతాబాద్ లైబ్రరీలో తొలిసారిగా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గతేడాది సమితి 63 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం డేట్ ఫిక్స్.. మరో సెలవు!
ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7న వచ్చింది కదా.. అందువల్ల నిమజ్జనం ఎప్పుడు చేస్తారనే అంశంపై ప్రజల్లో రకరకాల డౌట్స్ వస్తూ ఉంటే.. వెంటనే భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి క్లారిటీ ఇచ్చేసింది. సెప్టెంబర్ 17న నిమజ్జనం జరపబోతున్నట్లు తెలిపింది. అందువల్ల ఆ రోజు జంట నగరాల్లో పెద్ద పండుగే. ప్రతీ సంవత్సరం నిమజ్జనం రోజున హైదరాబాద్, సికింద్రాబాద్లో ప్రభుత్వ సెలవు ఉంటోంది కదా. ఈసారీ ఉండే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల జంటనగరాల ప్రజలు.. సెప్టెంబర్ 17న నిమజ్జనోత్సవంలో పాల్గొని గంగమ్మ ఒడికి గణేశుణ్ని పంపించే శోభాయాత్రలో తలమునకలవుతారు. ఈసారి ఖైరతాబాద్లో 70 అడుగుల సప్తముఖ మహాగణపతిని ప్రతిష్టిస్తున్నారు. గతేడాది మధ్యాహ్నం 1గంటలోపే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తి చేశారు. ఈసారి కూడా అలాగే చేస్తారని తెలుస్తోంది.
సెప్టెంబర్ 17న నిమజ్జనం ఉండటం వల్ల జంటనగరాల్లోని విద్యార్థులకు వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. ఎలాగంటే.. సెప్టెంబర్ 14న నెలలో రెండో శనివారం కావడం వల్ల ఆ రోజు స్కూళ్లకు సెలవు ఉంటుంది. మర్నాడు ఆదివారం కదా.. అది రెండో సెలవు అవుతుంది. సోమవారం అంటే సెప్టెంబర్ 16న మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) సందర్భంగా స్కూళ్లకు సెలవు ఉంది. ఇలా వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయి. 17న నిమజ్జనం ఉందని ప్రకటించారు కాబట్టి.. ఆ రోజు కూడా సెలవు ఉండే ఛాన్స్ ఉంది. అలా వరుసగా 4 రోజులు సెలవులు వస్తున్నాయి.
సెలవుల దృష్ట్యా కొంతమంది టూర్లకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఐతే.. నిమజ్జనంలో ప్రజలంతా పాల్గొనాలని కోరుతున్నారు. అందువల్ల టూర్లకు వెళ్లేవారు.. మొదటి 3 రోజులూ ప్లాన్ చేసుకొని.. నాలుగో రోజు నిమజ్జనంలో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా వరుస సెలవులు రావడం అరుదైన సందర్భం. ఇప్పటికే వర్షాల వల్ల స్కూళ్లకు సెలవులు ఉంటున్నాయి. చూస్తుంటే సెప్టెంబర్ నెలలో ఎక్కువ సెలవులే వచ్చేలా ఉన్నాయి.
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు
-
Sports8 months ago
Neeraj Chopra: పారిస్ 2024 ఒలింపిక్స్కు ప్రస్థానం