Andhra Pradesh
కేజీబీవీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇంకో వారం మాత్రమే గడువు!
ఆంధ్రప్రదేశ్లోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలల్లో నాన్-టీచింగ్, పార్ట్టైమ్ టీచింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సమగ్ర శిక్ష, పాఠశాల విద్యా శాఖ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 1,095 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఖాళీల్లో 352 టైప్-III కేజీబీవీలు, 210 టైప్-IV కేజీబీవీల్లో పోస్టులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. అర్హులైన మహిళలు ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
కేటగిరీ 3 కింద, అనేక ఉద్యోగాలు ఉన్నాయి. అవి యానిమల్ హస్బెండ్రీ మిల్క్మేన్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అసిస్టెంట్ కుక్, నైట్ వాచ్మెన్, హెడ్ కుక్, స్వీపర్ మరియు స్కావెంజర్. అదేవిధంగా, కేటగిరీ 4 కింద, కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అవి వార్డెన్, పార్ట్టైమ్ టీచర్, చౌకీదార్, హెడ్ కుక్ మరియు అసిస్టెంట్ కుక్.
చిత్తూరు జిల్లాలో 34 ఉద్యోగాలు
చిత్తూరు జిల్లాలోని ఎనిమిది కేజీబీవీల్లో 34 నాన్-టీచింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో కేటగిరీ-3లో 22, కేటగిరీ-4లో 12 పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల మహిళలు పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఈ నెల 11లోపు అందజేయాలని ఏపీసీ వెంకటరమణ సూచించారు.
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు ఏడేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్, కేజీబీవీల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు టెట్ పరీక్ష నుంచి ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
#APKGBVRecruitment#KGBVJobs2026#APGovernmentJobs#WomenJobsAP#NonTeachingJobs#PartTimeTeacherJobs#ChittoorJobs
#SamagraShiksha#EducationDepartmentAP#APJobNotification#LatestGovtJobs#WomenEmployment
![]()
