News
కుంగిన మేడిగడ్డ.. వారిపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ సిఫార్సు
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలంగాణ ప్రభుత్వానికి కీలక నివేదిక సమర్పించింది. ఈ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా 57 మంది అధికారులను బాధ్యులుగా గుర్తించారు. వీరిలో 33 మంది ఇంజినీర్లపై జరిమానా విధించాలని, 17 మంది నీటిపారుదల శాఖ అధికారులపై మరియు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ (L&T)పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది. బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతా పరీక్షలు సరిగా జరగలేదని, కొన్ని పరీక్షలు నిర్వహించకుండానే రికార్డులు సృష్టించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఈ నివేదికలో చర్యలకు సిఫార్సు చేసిన అధికారుల జాబితాలో పలువురు మాజీ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ENC)లు, ప్రస్తుత చీఫ్ ఇంజినీర్ (CE)లు, సూపరింటెండింగ్ ఇంజినీర్ (SE)ల పేర్లు ఉన్నాయి. నిర్మాణ సమయంలో క్షేత్రస్థాయి ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు నిబంధనలను పాటించలేదని, ఫలితంగా బ్యారేజీకి భారీ నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ గుర్తించింది. ఈ సంఘటన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన లోపాలను బయటపెట్టింది, దీనిపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు