International
కన్నీరు పెట్టుకున్న డిప్యూటీ సీఎం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ విక్టరీ ర్యాలీ సందర్భంగా జరిగిన ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నీటితో చెప్పారు. “చిన్న పిల్లలు కూడా ఈ ఘటనలో చనిపోవడం చాలా బాధాకరం. నా కళ్ల ముందే వారు ప్రాణాలు వదిలారు. వారి బాధను నేను స్వయంగా చూశాను,” అని ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని, మృతుల కుటుంబాలకు తాను క్షమాపణలు చెబుతున్నానని ఆయన తెలిపారు.
ఈ ఘటన నుంచి సమాజం పాఠాలు నేర్చుకోవాలని డీకే శివకుమార్ అన్నారు. “ఇంతటి విషాదాన్ని ఏ కుటుంబమూ జీర్ణించుకోలేదు. మనం ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రతిపక్షాలు ఈ ఘటనను రాజకీయం చేస్తూ శవ రాజకీయాలకు దిగుతున్నాయని ఆయన ఆరోపించారు. స్టేడియం సామర్థ్యం 35 వేల మంది అయినప్పటికీ, లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారని, ఇంత జనసమూహాన్ని పోలీసులు లేదా ప్రభుత్వం ఊహించలేదని ఆయన వివరించారు. బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన శివకుమార్, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు