Latest Updates
ఐపీఎల్ 2025: గతంలో హీరో కోసం, ఇప్పుడు హీరోయిన్ కోసం – శ్రేయస్ అయ్యర్ సంచలన రికార్డ్ దిశగా
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను విజేతగా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్, ఈ సారి పంజాబ్ కింగ్స్కు ట్రోఫీ అందించే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. ఒకవేళ ఈ ఫైనల్లో పంజాబ్ విజయం సాధిస్తే, వరుస సీజన్లలో వేర్వేరు జట్లను టైటిల్ విజేతగా నిలబెట్టిన తొలి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించనున్నారు.
2024 సీజన్లో కేకేఆర్ యజమాని, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ జట్టుకు ట్రోఫీ అందించిన అయ్యర్, ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ యజమాని, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాకు మరచిపోలేని కానుకగా టైటిల్ను అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్లో అయ్యర్ నాయకత్వ పటిమ, పంజాబ్ జట్టు ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొని ఉంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు