Andhra Pradesh
ఏలూరు కలెక్టరేట్లో కరోనా కలకలం: నలుగురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్న నేపథ్యంలో, ఏలూరు జిల్లా కలెక్టరేట్లో నలుగురు ఉద్యోగులకు కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఈ ఉద్యోగుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉంచి, అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కలెక్టరేట్లోని మిగతా ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మరోవైపు, గుంటూరు జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెనాలిలో ఒక కరోనా కేసు, తాడేపల్లిలో మరొక కేసు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై, పరీక్షలను ముమ్మరం చేయడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు