Latest Updates
ఎంసీపల్లి మున్సిపాలిటీలో పైరవీలతో పదవులు?: అవినీతి ఆరోపణలపై ప్రజల ఆందోళన
మేడ్చల్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఎంసీపల్లి మున్సిపాలిటీలో ఉన్నతస్థాయి పదవుల కోసం అడ్డదారుల్లో పైరవీలు జరిగినట్లు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యదర్శులు అక్రమ పైరవీల ద్వారా పదవులు సంపాదించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విధుల నిర్వహణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారికి, విధులకు గైర్హాజరైన వ్యక్తులకు కీలక పదవులు కట్టబెట్టడం వెనుక దాగిన ఆంతర్యం ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి, సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, అక్రమ పైరవీల ద్వారా పదవులు పొందిన వారిపై జిల్లా అడిషనల్ కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన మున్సిపల్ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ప్రజలు ఈ అవినీతి ఆరోపణలపై తగిన దర్యాప్తు జరిపి, న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు