Connect with us

International

ఆపరేషన్ సిందూర్’: పాక్ న్యూక్లియర్ బంకర్లపై భారత్ దాడి

అణుశక్తితో నడిచే క్షిపణులను కాల్చగల రహస్య రష్యన్ సైట్‌ను US పరిశోధకులు  కనుగొన్నారు - భారత్ శక్తి

ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత రక్షణ శాఖ పాకిస్తాన్‌లో న్యూక్లియర్ ఆయుధాలను దాచిన బంకర్లపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు మిలటరీ ఏవియేషన్ నిపుణుడు టామ్ కూపర్ తెలిపారు. శాటిలైట్ చిత్రాలు ఈ దాడులను నిర్ధారించగా, బంకర్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఆయన వివరించారు. దీంతో పాకిస్తాన్ సైన్యం తమ న్యూక్లియర్ ఆయుధాల వద్దకు చేరుకోలేకపోతోందని, ఈ పరిస్థితి కొనసాగితే పాక్ వ్యూహాత్మకంగా తీవ్ర నష్టం చవిచూస్తుందని కూపర్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులు ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న జరిగినవని, బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్, కోట్లీలలోని ఉగ్ర స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఆపరేషన్‌లో బ్రహ్మోస్ మిసైల్స్, స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, హామర్ స్మార్ట్ బాంబులను ఉపయోగించి భారత వైమానిక దళం నూర్‌ఖాన్, సర్గోధా, జాకోబాబాద్ వంటి పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే, కిరణా హిల్స్‌లోని న్యూక్లియర్ సౌకర్యంపై దాడి జరిగినట్లు వచ్చిన వాదనలను ఎయిర్ మార్షల్ ఏ.కె. భారతి ఖండించారు. సోషల్ మీడియాలో న్యూక్లియర్ రేడియేషన్, మెడికల్ ఎమర్జెన్సీల గురించి పోస్ట్‌లు వచ్చినప్పటికీ, అవి అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ ఆపరేషన్ భారత్‌ యొక్క సైనిక శక్తిని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని ప్రపంచానికి చాటిందని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending