Connect with us

Latest Updates

అర్చకులకు శుభవార్త: పెన్షన్, బీమా, గ్రాట్యుటీ పెంపు

ఏపీలో అర్చకులకు 25 శాతం వేతనం పెంపు

దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో సేవలందిస్తున్న అర్చకులు, ఉద్యోగులకు శుభవార్త అందింది. అర్చక సంక్షేమ బోర్డు, ఇతర కార్పొరేషన్ ఉద్యోగుల తరహాలో అర్చకులకు పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ చేసిన అర్చకులు, ఉద్యోగులు తమ సీనియారిటీ ఆధారంగా నెలకు ₹10,000 నుంచి ₹20,000 వరకు పెన్షన్ పొందనున్నారు.

అంతేకాదు, ఆస్పత్రి ఖర్చుల కోసం ఇప్పటివరకు ₹2 లక్షల వరకు రీయింబర్స్మెంట్ అందించగా, ఇకపై ఈ మొత్తాన్ని ₹5 లక్షల వరకు బీమా రూపంలో అందించనున్నారు. ఇదే క్రమంలో, గ్రాట్యుటీ మొత్తాన్ని కూడా ₹8 లక్షలకు పెంచేందుకు అర్చక సంక్షేమ బోర్డు ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయాలు అర్చకులు, ఆలయ ఉద్యోగుల ఆర్థిక భద్రతను పటిష్ఠం చేయడంతో పాటు వారి సంక్షేమానికి ఊతమిచ్చే దిశగా ముందడుగుగా నిలుస్తున్నాయి. ఈ చర్యలు ఆలయ సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending