News
అందాల భామల కాళ్ల వద్ద ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు: BRS ఆగ్రహం
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న అందాల భామల కాళ్ల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని భారత రాష్ట్ర సమితి (BRS) తీవ్రంగా మండిపడింది. రామప్ప ఆలయ సందర్శన సందర్భంగా జరిగిన ఒక సంఘటనపై BRS తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
BRS తన అధికారిక ట్వీట్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, “రామప్ప ఆలయ సందర్శన సమయంలో అందగత్తెలకు ఆడబిడ్డలు ఇత్తడి చెంబుల్లో నీళ్లు అందించారు. ఓ సుందరీమణి తన కాళ్లు కడుక్కున్న తర్వాత, వాటిని తుడవాలంటూ టవల్ను ఎదురుగా ఉన్న మహిళకు ఇచ్చారు. ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కాళ్లు తుడవాల్సి వచ్చింది” అని వివరించింది.
ఈ సంఘటన రాష్ట్ర ఆడబిడ్డల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉందని BRS ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యల ద్వారా మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని, ఇది ఖండనీయమని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రజల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు